బాలీవుడ్ లో ఆఫర్స్ ని ఆ కారణంగా వదులుకుంటున్న కీర్తి సురేష్

టాలీవుడ్ లో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తరువాత మహానటి సినిమాతో జాతీయ స్థాయి ఉత్తమనటి అవార్డు అందుకున్న అభినవ సావిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్.ఏకంగా మూడో సినిమాకే ఏ హీరోయిన్ కి రానంత గుర్తింపుని కీర్తి సొంతం చేసుకుంది.

 Keerthi Suresh Not Interested To Act In Glamour Role In Bollywood, Tollywood, Te-TeluguStop.com

మహానటి తర్వాత తెలుగులో సినిమాలకి రెండేళ్ళు గ్యాప్ ఇచ్చి మరల ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది.మహానటి తర్వాత వెంటనే సినిమాలు చేస్తే తెలుగు ప్రజలు తనని సావిత్రి పాత్రలోనే ఊహించుకునే అవకాశం ఉండటంతో ఆ హ్యాంగోవర్ వదిలే వరకు గ్యాప్ తీసుకుంది.

అయితే ఈ మధ్యలో తమిళంలో విజయ్, విశాల్ లాంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది.

అలాగే ఊహించని విధంగా మైదాన్ అనే బాలీవుడ్ సినిమాలో అజయ్ దేవగన్ కి జోడీగా నటించే ఛాన్స్ సొంతం చేసుకుంది.

ఈ సినిమా కోసం కొద్ది రోజులు ముంబైలో కూడా కీర్తి తిరిగింది.అయితే అజయ్ దేవగన్ పక్కన కీర్తి సురేష్ మరీ చిన్న పిల్లల కనిపిస్తుందని నిర్మాత బోణీ కపూర్ సలహా మేరకు కీర్తి ఈ సినిమా వదులుకుంది.

ఇదే సమయంలో బాలీవుడ్ లో ఆఫర్స్ గట్టిగానే వచ్చాయి.అయితే వాటిలో చాలా వరకు గ్లామర్ పాత్రలు కావడం, తనకు ఇష్టం లేని డ్రెస్సింగ్స్ తో నటించాల్సి పరిస్థితి ఉండటంతో అలాంటి పాత్రలు తాను చేయలేనని దర్శకులకి మొహం మీదనే చెప్పెస్తున్నట్లు తెలుస్తుంది.

తాను తన కంఫర్ట్ జోన్ లోనే సినిమాలు చేస్తా అని కూడా ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చినట్లు టాక్.ఈ విధంగా బాలీవుడ్ లో వచ్చిన అవకాశాలని కీర్తి సురేష్ వదులుకుంటుంది అని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube