ఈ మధ్యకాలంలో వ్యాపారాలు ఎంత దారుణంగా తయారు అయ్యారు అంటే.వారి వ్యాపారం కోసం ఎంత అయినా తెగించేస్తారు.
మనం మనుషులం.మోసం చెయ్యకూడదు అనేది ఏమి ఉండదు ఆ వ్యాపారులకు.
అలానే ఓ దారుణ ఘటన తమిళనాడులోని రామేశ్వరంలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
తమ పూర్వీకుల జ్ఞాపకార్థం కాకులకు అన్నాన్ని ఆహారంగా వేశారు.అయితే ఆ ఆహారాన్ని తిన్న కాకులు పెద్ద సంఖ్యలో చనిపోయాయి.
దీంతో అది చుసిన భక్తులు ఆందోళనకు గురై అధికారులకు సమాచారం అందించారు.దీంతో ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంపై నిఘా పెట్టారు.
ఈ నేపధ్యంలోనే అక్కడ మరికొన్ని కాకులు అలాగే చనిపోయాయి.అయితే ఆ కాకులను కొందరు వ్యక్తులు తీసుకొని వెళ్లి చికెన్ దుకాణాలలో అమ్ముతున్నారు.ఇది అంత గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారణ జరపగా వారు కాకులు తినే ఆహారంలో మధ్య కలుపుతున్నట్టు.అందుకే ఆ కాకులు మరించినట్టు చెప్పారు.
ఆ కాకుల మాంసాన్ని తీసుకెళ్లి చికెన్ లో కలుపుతున్నట్టు అత్యంత దారుణమైన నిజాన్ని బయట పెట్టారు.దీంతో పోలీసులు ఆ చికెన్ స్టాళ్లను మూసేసి ఆ నింధితులు ఇద్దరిని సెక్షన్ 420 కింద చీటింగ్ కేసును నమోదు చేసి అరెస్ట్ చేశారు.
అంతేకాదు ఆ నిందితుల నుండి 150 కాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.