తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నెల రోజులకు చేరబోతుంది.ఇంకా ప్రభుత్వం తగ్గక పోవడంతో సమ్మెను ఉదృతం చేస్తామంటూ ప్రకటించారు.
ఈ విషయమై ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు హైకోర్టులో కూడా పోరాడుతున్నారు.ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రతి రోజు ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు అంటూ దాఖలు అయిన వాజ్యంపై వాదోపవాదనలు జరిగాయి.
తాజాగా రాష్ట్ర హైకోర్టు సమ్మె విషయమై స్పందిస్తూ ఆర్టీసీ కార్మికులకు మరియు ప్రభుత్వంకు సలహా ఇచ్చింది.
ప్రభుత్వం విలీనం విషయమై తగ్గేట్లుగా లేదు కనుక మిగిలిన డిమాండ్ల విషయమై ప్రభుత్వంతో చర్చించుకోవాల్సిందిగా ఆర్టీసీ కార్మికులకు హైకోర్టు సూచించింది.
ఈ విషయంను మరింత లాగడం వల్ల ఇరు వర్గాలకు మంచిది కాదని ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో ప్రభుత్వం మరియు ఆర్టీసీ కార్మికులు కాస్త అయినా వెనక్కు తగ్గాలంటూ హైకోర్టు సూచించింది.ఈ కేసును నవంబర్ 1న మళ్లీ విచారించబోతున్నట్లుగా ప్రకటించి వాయిదా వేయడం జరిగింది.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంకు కార్మికులు గట్టిగా పట్టుబడుతున్నారు.కాని కేసీఆర్ ప్రభుత్వం మాత్రం విలీనంకు అస్సలు ఒప్పుకోవడం లేదు
.