తెలంగాణలో ఎన్నికల ఓట్ల లెక్కింపుకు కౌంట్ డౌన్ మొదలైంది.అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది.
ఈ క్రమంలో ఉదయం 10 గంటల కల్లా తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది.ముందుగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తారు.తరువాత ఉదయం 8.30 గంటలకు ఈవీఎంలను తెరచి ఓట్లను లెక్కిస్తారు.కాగా ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.ఈ మేరకు ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు.
అయితే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది.
అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద రాష్ట్ర, కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేస్తున్నారు.