ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మంత్రి అవ్వడం ఖాయం.ఈ వార్త యేడాదిన్నర కాలంగా ఏపీ పాలిటిక్స్లో పతాక స్థాయిలో చర్చకు వస్తోంది.
లోకేష్ను ఎమ్మెల్సీ చేసి బాబు తన కేబినెట్లోకి తీసుకుంటారు…లోకేష్కు భారీ పరిశ్రమలు, ఐటీ శాఖ కట్టబెడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉంటే ఏపీలో ఫిబ్రవరి రెండో వారంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతోంది.
ఈ క్రమంలోనే లోకేష్కు చంద్రబాబు షాక్ ఇస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గత రెండేళ్లుగా లోకేష్ వ్యవహారశైలీ, ఇతరత్రా అంశాల్లో చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.
చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలతో పాటు ఏపీ ఫ్యూచర్ సీఎం చినబాబే అంటూ టీడీపీ వర్గాలు సైతం భావిస్తున్నాయి.అలాంటి లోకేష్ ఎలా ఉండాలి…ప్రజల్లోకి జెట్ స్పీడ్తో దూసుకుపోవాలి.
కానీ లోకేష్ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటకీ పార్టీపైనా, ప్రభుత్వంపైనా పట్టు సంగతి పక్కన పెడితే ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లలేకపోతున్నారు.
తనకు గుర్తు వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో ఒకటి రెండుసార్లు విపక్షాలపై కౌంటర్లు వేయడం మినహా లోకేష్కు ఇప్పటకీ ప్రజల్లో సరైన గ్రిప్ లేదని రాజకీయ విశ్లేషకుల అంచనా.కీలక అంశాలపై మాట్లాడడంలో చంద్రబాబును పక్కన పెట్టి, విపక్ష వైసీపీ అధినేత జగన్ను ఎదుర్కోవడం లోకేష్కు సాధ్యమవుతుందా అన్న డౌట్లు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు
తండ్రికి ఉన్న అధికారం ద్వారా కొందరు మంత్రుల శాఖల్లో వేలుపెట్టి అప్పుడప్పుడూ ఆధిపత్యం చూపిస్తున్నా…లోకేష్కు ప్రజల్లో ఎలా మాట్లాడాలన్న అంశంపై ఇప్పటకీ సరైన సబ్జెక్ట్ ఉందా ? అంటే ఆ ప్రశ్నకు సమాధానం డౌటే.? ఇప్పుడు లోకేష్కు వచ్చిన అవకాశాలు ఇంతకు ముందు దివంగత ఎన్టీఆర్ హయాంలో చంద్రబాబుకు రాలేదు.ఇప్పుడు తనయుడు కోసం చంద్రబాబు రెడ్ కార్పెట్ వేస్తున్నా లోకేష్ మాత్రం దానిని అంది పుచ్చుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడనే చర్చలే వినిపిస్తున్నాయి.
ఈ అంశాల నేపథ్యంలో చంద్రబాబు లోకేష్ను ఎమ్మెల్సీని చేసి తన కేబినెట్లోకి తీసుకుంటే…మరిన్ని విమర్శలు వస్తాయన్న నేపథ్యంలో చంద్రబాబు ఈ ప్రతిపాదన తాత్కాలికంగా పక్కన పెట్టేసినట్టే తెలుస్తోంది.చంద్రబాబు వద్ద కొందరు మంత్రులు సైతం లోకేష్కు ఎమ్మెల్సీ ప్రతిపాదన తేగా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఇక లోకేష్ డైరెక్టుగా 2019 ఎన్నికల బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోవాల్సి ఉంది.