ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో అపాయింట్మెంట్ ఖరారైతే రేపు వెంటనే జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం వర్గాలలో వినబడుతున్న టాక్.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే గనక తర్వాత మరికొంతమంది కేంద్ర మంత్రులతో వైయస్ జగన్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.అంతా ఓకే అయితే దాదాపు రెండు రోజుల పాటు జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టే అవకాశం ఉంది.
రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన బ్యాలెన్సింగ్ నిధులు అదే రీతిలో కరోనా నేపథ్యంలో కేంద్రం ఇస్తానన్న సాయంతో పాటు మూడు రాజధానులు ఈ విషయంపై అమిత్ షా తో చర్చించనున్నట్లు సమాచారం.అదేరీతిలో వ్యాక్సిన్ కొరత అంశంపై ప్రత్యేకంగా అమిత్ షాతో వైయస్ జగన్ మాట్లాడ బోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అమిత్ షా వైయస్ జగన్ కి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
.