భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య..!

ఇద్దరూ ప్రేమించుకున్నారు.ఇద్దరి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.

 Medchal, Woman, Suicide-TeluguStop.com

తరచూ భర్త వేధింపులకు పాల్పడుతుండటంతో తీవ్ర మనస్థాపానికి గురైంది.ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది.

బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్ లోని మేడ్చల్-మల్కాజిగిరిలో విషాదం చోటు చేసుకుంది.

రాంపల్లికి చెందిన త్రినేయని (20) భర్త అక్షయ్ తో కలిసి నివాసముంటున్నారు.వీరిద్దరికి ఏడు నెలల క్రితమే వీరికి వివాహం జరిగింది.

గత కొంత కాలంగా ప్రేమించుకున్న వీరు పెళ్లికి ఇంట్లో వాళ్లకు ఒప్పించేందుకు ప్రయత్నించారు.కానీ ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.

అయితే అప్పటి నుంచి ఇద్దరు రాంపల్లిలో కలిసి ఉంటున్నారు.గత కొద్దిరోజులుగా అక్షయ్ తన భార్యను తీవ్రంగా వేధించసాగాడు.

దీంతో త్రినేయని తీవ్ర మనస్థాపానికి గురైంది.ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోయింది.

తరచూ గొడవలు పెరగటంతో సోమవారం రాత్రి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఈ మేరకు త్రినేయని తండ్రి భర్తే తన కూతురుని చంపాడని కీసర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube