విశాఖ విజయసాయిరెడ్డి రాజధాని.. ఎంపీ రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు

విశాఖ విజయసాయిరెడ్డి రాజధాని అని ఎంపీ రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజు విజయసాయి రెడ్డే, ధనం విజయసాయి రెడ్డిదేనని విమర్శించారు.

 Vijayasai Reddy Capital Of Visakha. Mp Rammohan Naidu's Sensational Comments-TeluguStop.com

విశాఖ రాజధానంటూ ఉత్తరాంధ్రులను మాయ చేస్తున్నారని ఆరోపించారు.మూడున్నర సంవత్సరాలుగా ఉత్తరాంధ్రకు వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు ఏమీ చేయని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.వైసీపీది అభివృద్ధి వికేంద్రీకరణ కాదన్న ఆయన అవినీతి వికేంద్రీకరణ అంటూ ఎద్దేవా చేశారు.

జగన్ అవినీతిని విశాఖ వరకు తెచ్చేందుకే మూడు రాజధానులని ధ్వజమెత్తారు.జగన్ కు కావాల్సింది ప్రాంతాలు, ప్రజల మధ్య కొట్లాట అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube