కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్ళీ కొత్త వేరియంట్ తో విజృంభిస్తుంది.రోజురోజుకూ కేసులు మరింత పెరుగుతున్నాయి.
ఈసారి ఓమిక్రాన్ రూపంలో ముప్పు తప్పదని అర్ధం అయ్యింది.థర్డ్ వేవ్ కేసులు రోజురోజుకూ ఎక్కువ అవుతూ ప్రజల్లో మళ్ళీ భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
ఒకవైపు సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు.
ఇప్పటికే మన టాలీవుడ్ లో మంచు మనోజ్, మంచు లక్ష్మి, మహేష్ బాబు, విశ్వక్ సేన్, నితిన్ భార్య షాలిని, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
దీంతో ఈ సీన్ చూస్తే కరోనా మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి కనిపిస్తుంది.మరొకసారి ఇండస్ట్రీలో గతంలో లాంటి పరిస్థితి తప్పదు అని ఇప్పటికే విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు.
కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు థియేటర్ లు మూసి వేయడం, షూటింగ్ లు వాయిదా పడడం వంటివి చాలా జరిగాయి.
అప్పుడు ఆగిపోయిన షూటింగ్స్ కారణంగా మళ్ళీ ఇప్పటికి కూడా ఆ సినిమాలు విడుదల కాలేక పోయాయి.తాజాగా మళ్ళీ అదే పరిస్థితి ఎదురు కాబోతుండడంతో ఇండస్ట్రీ మొత్తం ఏం చేయాలో అర్ధం కాక విలవిలలాడి పోతున్నారు.
తాజాగా విజయ్ దేవరకొండ లైగర్ షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయిందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.తన ఇంస్టాగ్రామ్ వేదికగా విజయ్ తన పెంపుడు కుక్కతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ”స్పష్టంగా మరొక తుఫాను.షూటింగ్ రద్దు అయ్యింది” అంటూ విజయ్ దేవరకొండ కరోనా కారణంగా షూటింగ్ క్యాన్సిల్ అయినట్టు తెలిపాడు.
ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది అని ప్రకటించారు.