ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో వైరస్లు పుట్టాయి.అంతరించి పోయాయి.
కానీ ఆ సమయంలో మానవుల ఆలోచనల్లో ఇప్పుడున్నంతలా అభివృద్ధి గానీ, టెక్నాలజీ, వైద్యం గానీ ఆ కాలంలో అందుబాటులో లేవు.

ప్రస్తుతం ఒక్క మరణాన్ని తప్ప అన్నీంటిలో విజయుడిగా నిలుస్తున్న మనిషికి ఊహించని సవాల్గా మారింది కరోనా వైరస్.దీని ధాటికి ప్రపంచం మొత్తం నిశబ్ధంగా మారుతుందని, చివరికి శ్మశానాల్లో కూడా కాసింత చోటు కరువు అవుతుందని ఎవరు ఊహించి ఉండరు.ఎప్పుడైతే కరోనా పురుడు పోసుకుందో అప్పటినుండి ప్రజల జీవితాలు కూడా పూర్తిగా మార్పుకు లోనయ్యాయి.
ఇకపోతే ఇప్పటికే కరోనా వల్ల లాక్డౌన్ విధించిన ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే దీన్ని సడలింపు చేయాలని ఆలోచిస్తున్నాయి.కానీ యూకేలో లాక్డౌన్ మరో నెల రోజులపాటు పొడిగించేలా చర్యలు చేపట్టారట.
దీనికి కారణం కరోనా వైరస్ డెల్టా వేరియంట్ వల్ల కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తుండడంతో యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.