Jagga Reddy : ఎంపీ ఎన్నికలలోపు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వటానికి 20 మంది సిద్ధం జగ్గారెడ్డి సంచలన కామెంట్స్..!!

తెలంగాణ రాష్ట్రంలో మరో 60 రోజుల్లో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) జరగబోతున్నాయి.గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.

 Twenty People Ready To Join Congress Jaggareddy Sensational Comments-TeluguStop.com

ఈ క్రమంలో ఆల్రెడీ ప్రచారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది.దీనిలో భాగంగా ఇంద్రవెల్లిలో సభ కూడా నిర్వహించారు.

ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి( Congress Senior Leader Jagga Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.పాలనపరంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఏనాడు సచివాలయానికి రాలేదని కేవలం వారు ఇళ్లల్లో నుంచే పరిపాలన కొనసాగించారని విమర్శించారు.బుధవారం గాంధీభవన్( Gandhi Bhavan ) లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు.

ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ అదే విధంగా మాజీ సీఎం కేసీఆర్( Former CM KCR ) లపై మండి పడటం జరిగింది.ఆ ఇద్దరు నాయకులు బీజేపీ ఆదేశాలతోనే పనిచేస్తున్నట్లు ఆరోపించారు.తెలంగాణ అభివృద్ధి చెందొద్దని కేసీఆర్, జగన్ కుట్రలకు పాల్పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) ఎక్కువ కాలం ఉండదని వ్యాపారవేత్తలను అయోమయానికి గురి చేస్తున్నట్లు మండిపడ్డారు.

ఎమ్మెల్యేలను నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు డ్రామాలాడుతున్నారు.ఆ పార్టీకి చెందిన 20 మంది  ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

పార్లమెంట్ ఎన్నికలలోపు ఈ 20 మందిని కాంగ్రెస్ పార్టీలోకి లాక్కుందామని సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) చెప్పానని లేట్ చేయొద్దని సూచించినట్లు జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube