మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించి రికార్డుల మోత మ్రోగించాడు.ఇక తాజాగా ఈ మాంత్రికుడి తర్వాత సినిమా ఏంటి అనే విషయంలో గత కొన్ని రోజులుగా అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈయన ప్రస్తుతం కథను రెడీ చేసుకుకే పనిలో ఉన్నాడని తెలుస్తోంది.మొదటగా ఎన్టీఆర్తో త్రివిక్రమ్ సినిమా ఉండే అవకాశాలున్నాయి అని అంతా భావించారు.
ఆ తర్వాత సమంతతో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ఉంటుందని అనుకున్నారు.అయితే తాజాగా మరో కొత్త వార్త ఒకటి ఫిల్మ్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ మాటల మాంత్రికుడు తన తదుపరి సినిమాను ఒక యువ హీరోతో చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.అయితే ఆ యువ హీరో ఎవరు అనే విషయం మాత్రం ఇంకా నిర్ణయం కాలేదు అని, ప్రస్తుతం స్టార్ హీరోలు అంతా కూడా ఫుల్ బిజీగా ఉండటం వల్లే త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటున్నారు.
మరో రెండు నెలల్లోనే త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఎంతో మంది యువ హీరోలు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు క్యూ కట్టి ఉన్నారు.
మరి అందులో ఎవరిని ఈ మాంత్రికుడు ఎంపిక చేసుకుంటాడో చూడాలి.