‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా తర్వాత త్రివిక్రమ్ చేయబోతున్న సినిమాపై గత కొన్ని రోజులుగా తెగ ప్రచారం జరుగుతోంది.మొదట ఈయన సమంతతో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం చేయాని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత యువ హీరోలు నితిన్ లేదా నాగచైతన్యతో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది.మరీ ముఖ్యంగా త్రివిక్రమ్కు నితిన్ భారీ ఆఫర్ ఇచ్చాడని, తనతో సినిమా చేస్తే దాదాపు 25 కోట్లు ఇస్తానంటూ నితిన్ బేరమాడుతున్నట్లుగా ప్రచారం జరిగింది.
అయితే తాజాగా మరో కొత్త వార్త ఫిల్మ్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది.
ఇటీవలే తమిళ స్టార్ హీరో సూర్యకు త్రివిక్రమ్ కథను చెప్పాడనే వార్తలు వస్తున్నాయి.
వచ్చే సంవత్సరం ప్రారంభంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్స్పైకి వెళ్లనుందని కూడా ప్రచారం జరుగుతోంది.తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించేందుకు ఇప్పటి నుండే ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.
వీరిద్దరి కాంబినేషన్ వర్కౌట్ అయితే అక్కడ, ఇక్కడ భారీ కలెక్షన్స్ ఖాయం అని సినీ ప్రముఖులు అంటున్నారు.మరి ఈ వార్త అయినా నిజమయ్యేనో లేక త్రివిక్రమ్ ముందు వార్తల్లా పుకారుగా మిగిలేనో చూడాలి.