దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్..: కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.

 The Poverty Of The Country Is Congress..: Kishan Reddy , Congress , Bjp, Cm Reva-TeluguStop.com

బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.ఈ క్రమంలోనే ముస్లిం రిజర్వేషన్లను కాంగ్రెస్ ఏ ప్రాతిపదికన తీసుకొచ్చిందని ప్రశ్నించారు.

కశ్మీర్ లో జిన్నా రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అమలు చేసిందని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని చెప్పారు.

తప్పుడు ప్రచారంతో ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ( Congress party ) బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగిస్తోందన్న కిషన్ రెడ్డి సోనియాను కాంగ్రెస్ దేశం మీద రుద్దే ప్రయత్నం చేసిందని విమర్శించారు.

అయితే బీజేపీ( BJP ) ప్రతిఘటించడంతో ఈ విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఇటలీ నేషనల్ కాంగ్రెస్ గా మారిపోయిందన్నారు.

ముస్లింలను బీసీల్లో చేర్చి వారికి కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని తెలిపారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కారణంగా బీసీలకు అన్యాయం జరిగిందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )కి దమ్ముంటే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube