వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆమెకు హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స కొనసాగుతుంది.
ఈ నేపథ్యంలో ప్రీతి తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
తన కూతురు ప్రీతి ఆరోగ్యం మరింత విషమించిందని తెలిపారు.
చివరి ప్రయత్నంగా ఎక్మో ప్రయోగిస్తున్నామని వైద్యులు చెప్పారన్నారు.తన కూతురిని వేధింపులకు గురి చేయడం వలనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.
కొందరు కావాలనే పని గట్టుకుని మరీ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతుందని ప్రీతి తండ్రి ఆరోపించారు.