తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ఉద్రిక్తత

తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.హోంమంత్రి తానేటి వనిత( Home Minister Taneti Vanita ) బస శిబిరంపై మూకుమ్మడి దాడి జరిగింది.

 Tension Among Nallajars Of East Godavari District , East Godavari District, Home-TeluguStop.com

బస శిబిరంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.ఈ దాడిలో హోంమంత్రి తానేటి వనిత ప్రచార వాహనంతో పాటు సౌండ్ సిస్టమ్ ధ్వంసం అయింది.

మూకుమ్మడి దాడిలో పలువురు వైసీపీ నేతలకు గాయాలు కాగా.పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.

అయితే ఈ దాడిలో టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు స్వయంగా పాల్గొన్నారని తెలుస్తోంది.గోపాలపురం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా ఉన్న తానేటి వనిత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

అర్థరాత్రి దాడి ఘటన చోటు చేసుకోగా సమాచారం అందుకున్న తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ జగదీశ్( SP Jagadish ) ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ లో రికార్డైన దాడి దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube