తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.హోంమంత్రి తానేటి వనిత( Home Minister Taneti Vanita ) బస శిబిరంపై మూకుమ్మడి దాడి జరిగింది.
బస శిబిరంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.ఈ దాడిలో హోంమంత్రి తానేటి వనిత ప్రచార వాహనంతో పాటు సౌండ్ సిస్టమ్ ధ్వంసం అయింది.
మూకుమ్మడి దాడిలో పలువురు వైసీపీ నేతలకు గాయాలు కాగా.పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.
అయితే ఈ దాడిలో టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు స్వయంగా పాల్గొన్నారని తెలుస్తోంది.గోపాలపురం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా ఉన్న తానేటి వనిత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
అర్థరాత్రి దాడి ఘటన చోటు చేసుకోగా సమాచారం అందుకున్న తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ జగదీశ్( SP Jagadish ) ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ లో రికార్డైన దాడి దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.