ఏపీలో టీడీపీ నిర్వహిస్తున్న వినూత్న నిరసన కార్యక్రమంపై వైసీపీ నేత మల్లాది విష్ణు మండిపడ్డారు.జగనాసుర దహనం పేరుతో టీడీపీ నిరసన కార్యక్రమాలు సరికాదని అన్నారు.
టీడీపీయే నరకాసురుడు, బకాసురుడని మల్లాది విష్ణు ఆరోపించారు.గతంలో టీడీపీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలు అట్టర్ ప్లాప్ అని పేర్కొన్నారు.
అలాగే టీడీపీ – జనసేన తొలి సమన్వయ కమిటీ భేటీ కావడం విడ్డూరంగా ఉందన్నారు.గతంలో కూడా టీడీపీ, జనసేన కలిసి పని చేశాయని మల్లాది విష్ణు వెల్లడించారు.