శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పొందూరు పంచాయతీ వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది.ఇందులో భాగంగా వైసీపీకి చెందిన సర్పంచ్ రేగిడి లక్ష్మీ నివాసంపై గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో రాళ్లతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
ఈ దాడిలో సర్పంచ్ ఇంటి అద్దాలు ధ్వంసమైయ్యాయి.అయితే తన ఇంటిపై స్థానిక వైసీపీ నేతలే దాడి చేశారని సర్పంచ్ లక్ష్మీ ఆరోపిస్తున్నారు.
సొంత పార్టీ వారే తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.