ప్రపంచంలో కరోనా తన పెత్తనాన్ని ఇంకా తగ్గించుకోలేదని తెలుస్తుంది.మనిషి మీద ప్రకృతి ఆధిపత్యం చలాయించడాన్ని సహించలేని మానవుడు ఆ ప్రకృతికే ఎదురు తిరిగాడు.
దీని ఫలితంగా కష్టాలు ఎదుర్కొంటున్నాడు.ఇకపోతే కరోనా వైరస్ ప్రజల పాలిట యమపాశంగా మారగా, ముఖ్యంగా ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనాతో చనిపోయిన వారిలో పురుషులే అత్యధికంగా ఉన్నట్లుగా.
తాజా గణాంకాలు తెలియచేస్తున్నాయట.
కాగా ఇప్పటి వరకు జిల్లాలో కరోనా బారిన పడినవారిలో పురుషులే ఎక్కువగా ఉన్నారని ఈ నెల 2వ తేదీ వరకు పరిశీలించిన గణాంకాలు తెలియచేస్తున్నాయట.ఇక కోవిడ్ బారిన పడి మరణించిన వారు మొత్తం 741 మంది కాగా, ఇందులో 516 మంది పురుషులు, 225 మంది మహిళలు ఉన్నట్లుగా తెలుపుతున్నారు.
అంటే వీరి లెక్కల ప్రకారం కరోనా మృతుల్లో సుమారు 70% మంది పురుషులు, 30% మంది మహిళలు ఉన్నట్లుగా తెలుస్తుంది.నిజానికి ఈ ప్రాంత పురుషులకు ఇది షాక్ అయ్యే విషయమే.