కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్లో వరుస చిత్రాలతో దూసుకుపోతుంది.ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే సక్సెస్ కొట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత యంగ్ హీరో నితిన్తో కలిసి భీష్మ అనే సినిమాలో నటించింది.
ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలవడంతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు అందుకుని సత్తా చాటుతోంది.కాగా ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్గా మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది ఈ బ్యూటీ.
అయితే టాలీవుడ్లో వరుస సక్సెస్ చిత్రాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ, ఇప్పుటికే ఇక్కడ వరుస హిట్లతో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఇద్దరు హీరోయిన్లకు రష్మిక పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.ఫిదా చిత్రంతో టాలీవుడ్ను దున్నేసిన సాయి పల్లవి, ఆ తరువాత వరుసబెట్టి సక్సెస్ చిత్రాలను చేసుకుంటూ వెళుతోంది.
ఇక మహానటి చిత్రంతో నేషనల్ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ కూడా టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకుంది.
ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్లకు టెండర్ పెట్టేందుకు రష్మిక రెడీ అయ్యింది.
పుష్ప సినిమా సక్సెస్తో టాలీవుడ్ దర్శకనిర్మాతలు మీడియం రేంజ్ సినిమాలతో మొదలుకొని భారీ సినిమాల వరకు రష్మిక ముందు పెట్టేందుకు రెడీ అవుతారు.మరి ఈ బ్యూటీ తనదైన యాక్టింగ్తో పాటు అందాల ఆరబోతలోనూ తనకు తానే ప్రత్యేకమని ఇప్పటికే నిరూపించుకుంది.
పుష్ప సినిమాతో రష్మిక మరోసారి టాలీవుడ్ను షేక్ చేస్తుందని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.