4.5 జనరేషన్ యుద్ధ విమానాలలో ఒకటైన రఫెల్ జెట్ మొదటి బ్యాచ్ నేడు భారత వాయుసేనలో ఇండక్ట్ చేశారు.ఈ సెర్మనీకి చీఫ్ గెస్ట్ గా రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అటెండ్ అయ్యారు.ఇక బోర్డర్ లో ఒకపక్క చైనా మరోపక్క పాకిస్థాన్ వల్ల నిరంతరం ముప్పును ఎదుర్కొంటున్న భారత్ ఆర్మీకి రఫెల్ సరికొత్త బలాన్ని చేకూర్చింది.
ఇక ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఉద్దేశించి దేశంలోని చాలామంది ప్రముఖులు ట్వీట్స్ చేశారు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం భారత సైన్యంలో కల్నల్ స్థాయి సేవలు అందిస్తున్నారు.
ఆయన ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఉద్దేశిస్తూ కొన్ని ట్వీట్స్ చేశారు.ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం.
వరల్డ్ బెస్ట్ 4.5 జనరేషన్ ఫైటర్ జెట్లు ఇప్పుడు వరల్డ్ బెస్ట్ పైలెట్స్ చేతికి వచ్చాయి.రకరకాల యుద్ధ విమానాలతో భారత్ వాయుసేన బలం మరింత పెరిగింది.ఇక 17 స్క్వాడ్రన్ గోల్డెన్ యారోస్ కు ఆల్ ది బెస్ట్.రఫెల్ జెట్స్ మిరాజ్,సుకోయి సర్వీస్ రికార్డ్ లను బ్రేక్ చేయాలంటూ ట్వీట్స్ చేశారు.