కంటికి కనిపించని అతిసూక్ష్మజీవి కరోనా వైరస్.ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలను శాసిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కోవడం ప్రపంచదేశాలకు పెను గండంగా మారింది.ఇప్పటికే కరోనా కోరల్లో చిక్కుకుని లక్షల మంది మృతి చెందారు.
ఎన్నో కుటుంబాలు చిన్నా భిన్నం అయ్యాయి.ఆర్థికంగా కూడా అందిరినీ నష్టపరిచింది.
ఇక గత ఏడాది డిసెంబరులో మొదలైన ఈ కరోనా వైరస్.ఇప్పటికీ శరవేగంగా విజృంభిస్తూనే ఉంది.
ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచదేశాల శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.మరోవైపు రష్యా వ్యాక్సిన్ విడుదల చేసినా.పలు అనుమానాల కారణంగా వల్ల దానివైపే ఎవరూ చూడటం లేదు.ఇదిలా ఉంటే.
కరోనా విజృంభిస్తున్న వేళ జరుగుతున్న కొన్ని దారుణాలు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి.తాజాగా ఓ హాస్పటల్లో కరోనా సోకిన వైద్యుడే రోగులకు చికిత్స చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ దారుణ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.ఉన్నతాధికారులే కరోనా సోకిన వైద్యుడితో రోగులకు చికిత్స చేయిస్తున్నారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
జనగామ జిల్లా ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పనిచేసే ఓ యువ వైద్యుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో.టెస్ట్ చేయించుకున్నాడు.
ఆ రిపోర్టుల్లో సదరు వైద్యుడికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది.
ఈ విషయాన్ని సదరు డాక్టర్ ఉన్నతాధికారులకు వివరించాడు.
అయితే సదరు డాక్టర్ మాటలు లెక్కచేయని అధికారులు.నీ డ్యూటీ ఖచ్చితంగా చేయాల్సిందే అంటూ పట్టుపట్టారు.
దీంతో చేసేదేమి లేక.తన పైఅధికారులు చెప్పినట్టే రోగులకు చికిత్స చేశారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న రోగులు బిక్కుబిక్కు మంటూ వణికిపోతున్నారు.ఇక ఆ నోట, ఈ నోట పాకి విషయం కాస్త నెట్టింట్లో వైరల్ అయింది.
దీంతో ప్రాణం కాపాడాల్సిన డాక్టర్లే ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.