ఇజ్రాయెల్( Israel ).హమాస్ మిలిటెంట్ ల మధ్య బీకరమైన పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే.
అక్టోబర్ ఏడవ తారీఖు నుండి మొదలైన ఈ యుధ్ధం ఉన్న కొద్ది తీవ్రతరం అవుతూ ఉంది.ఇజ్రాయెల్ మెరుపు దాడులతో గాజాలోని విద్యుత్ ప్లాంట్ మూసివేయడంతో నగరం మొత్తం అంధకారంలోకి వెళ్లిపోయింది.
విద్యుత్ తో పాటు వాటర్ కూడా నిలిపివేయడంతో ఉగ్రవాదులకు కేంద్రంగా ఉన్న గాజానీ ఇజ్రాయెల్..
అష్టదిగ్బంధం చేసింది.గాజా సరిహద్దులను మూసివేయడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు( Prime Minister Benjamin Netanyahu ) సంచలన నిర్ణయం తీసుకున్నారు.విపక్ష నేత బెన్నీ గాంట్జ్ తో కలసి అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఎమర్జెన్సీ ప్రభుత్వం ఇకనుండి కీలక నిర్ణయాలు తీసుకోబోతుందని స్పష్టం చేశారు.హమాస్ తో జరిగే యుద్ధంకి సంబంధించి.
తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా చూడటంతో పాటు విదేశాలతో సమన్వయం చేసుకోవడం.ఈ ఎమర్జెన్సీ ప్రభుత్వం చేపట్టాల్సిన విధులు అని పేర్కొన్నారు.
ఇవి తప్ప దేశంలో పరిస్థితులు విధివిధానాలతో ఎటువంటి సంబంధం ఉండదని చెప్పుకొచ్చారు.పరిస్థితులు అంత సద్దు మణిగాక ఈ ప్రభుత్వ స్థానంలో తిరిగి సాధారణ ప్రభుత్వం బాధ్యతలు చేపడుతుందని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలియజేశారు.