పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్( Prabhas ) ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Om raut ) దర్శకత్వంలో భారీ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”ఆదిపురుష్”( adipurush ).ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ఆడియెన్స్ సైతం ఎదురు చూస్తున్నారు.
మరో నెల రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి అప్పుడే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.
ఈ క్రమంలోనే అదిరిపోయే రేంజ్ లో ట్రైలర్ ను రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది.ట్రైలర్ కట్ ఎలా ఉంటుందో అని అనుకున్న ఫ్యాన్స్ కు ఓం రౌత్ ‘జై శ్రీరామ్’ అనే నినాదం ఫ్యాన్స్ చేసేలా చేసాడు.
ఇప్పటి వరకు సినిమా మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ పోయేలా చేసి పాజిటివ్ గా మార్చేశాడు.
మొత్తానికి ప్రేక్షకులను జూన్ 16 ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ సినిమా ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూసేలా చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.
మరి తాజాగా ప్రభాస్ ఈ సినిమా విషయంలో ఒక అరుదైన రికార్డ్ అందుకున్నాడు.ఆదిపురుష్ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి ఏకంగా 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను చేరుకుంది.
ప్రభాస్ నటించిన వరుస నాలుగు సినిమాలకు 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ట్రైలర్స్ ఉన్న హీరో ప్రభాస్ అని తెలుస్తుంది.బాహుబలి తర్వాత భారీ హైప్ తెచ్చుకుంటున్న ఈయన సినిమా ట్రైలర్స్ ప్రతీసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.ఈ రేర్ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్న ఏకైక హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి.