పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్.ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాకు రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు, సాంగులకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఈ సినిమా పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కబోతోంది.ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ, ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
అంతేకాకుండా రెండు సంవత్సరాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం మరింత ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇక విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా జనవరి 14, 2022న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది.
ఈ ఈవెంట్ కి భారీగా అభిమానులు తరలి వస్తున్నారు.రాధేశ్యామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు అనగా డిసెంబర్ 23న జరగనుంది.
ఈ కార్యక్రమానికి ప్రభాస్ అభిమానులు దాదాపుగా 40 వేల మందికి పైగా హాజరుకానున్నారు.పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరో నవీన్ పొలిశెట్టి హోస్ట్ గా వ్యవహరించనున్నారు.ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.ఇండియాలో మరే సినిమాకు అర్థం కాని రీతిలో ఒకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేశాయి.ఇకపోతే ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే బోలెడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు ఈ పాన్ ఇండియా స్టార్.
రాధేశ్యామ్, సలార్, ఆది పురుష్, ప్రాజెక్టు కె, భారీ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.