పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్‘.రోమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇటలీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ.ఈ ప్రేమ కథకు అద్బుతమైన గ్రాఫిక్స్ యాడ్ చేసి ఈ సినిమాను రాధాకృష్ణ తెరకెక్కించాడు.ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇక విడుదల తేదీ కూడా దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు చిత్ర యూనిట్.ఇప్పటికే ఈ సినిమా నుండి సాంగ్స్, పోస్టర్స్, టీజర్ వంటివి వదిలారు.వీటితో ఈ సినిమా రెగ్యులర్ ప్రేమ కథ కాదని అంతకు మించి ఉంటుందని ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుకున్నారు.
ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డేట్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.
డిసెంబర్ 23న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసారు.
హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ ఈవెంట్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.ఈ రోజు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇప్పటికే ప్రభాస్ అభిమానులు బారులు తీరుతున్నారు.
ప్రభాస్ అభిమానులు ఇంకొక అప్డేట్ కోసం కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అది ఏంటంటే ఈ సినిమా ట్రైలర్ కోసం డార్లింగ్ అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.మరి వారు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది.ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ఈ సినిమా ట్రైలర్ ను కూడా లాంచ్ చేయబోతున్నారు.
ఇంకొన్ని గంటల్లో రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానుల చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల కాబోతుంది.మరి చూడాలి ఈ ట్రైలర్ ఎంత మ్యాజిక్ చేస్తుందో.