హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.హెచ్సీఏలో మొత్తం 173 ఓట్లు ఉండగా వీరిలో 169 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, ప్రజ్ఞాన్ ఓజా ఉన్నారు.అదేవిధంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా పోటీలో నాలుగు ప్యానెళ్లు ఉండగా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీతో పాటు ట్రెజరర్ పోస్టులకు హెచ్ సీఏ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.