30 మంది ప్రాణాలు కాపాడి తాను చనిపోయిన శునకం

విశ్వాసానికి మారు పేరుగా కుక్కని అందరూ భావిస్తూ ఉంటారు.ఒక మనిషిని నమ్మే బదులు కుక్కని నమ్మితే విశ్వాసంగా పడి ఉంటది అనే మాట చాలా మంది రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు.

 Pet Dog In Uttar Pradesh Saves Lives Of Over 30 People1-TeluguStop.com

కొన్ని సందర్భాలలో శునకాలు ఆ మాటలు నిజమని రుజువు చేస్తూ ఉంటాయి.అందరిని ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఆ శునకాల మీద మరింత ప్రేమ పెరిగేలా చేస్తాయి.

ఇప్పుడు కూడా ఈ శునకం ఉత్తరప్రదేశ్ లో అలాగే ముప్పై మంది ప్రాణాలు కాపాడింది.ఉత్తరప్రదేశ్‌లోని బాందా ప్రాంతంలో ఓ భవనంలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.

ప్రమాదాన్ని పసిగట్టిన శునకం కాసేపటికి వరకు గట్టిగా మొరుగుతూనే ఉంది.

దాని అరుపులు విన్న అక్కడి జనం ఇళ్లలో నుంచి బయటికి వచ్చి చూశారు.

భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగడం గమనించారు.దీంతో దాదాపు 30 మంది వరకు బయటకు పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు.

ఇంత మంది ప్రాణాలు కాపాడిన ఆ శునకం మాత్రం తన ప్రాణాలను కాపాడుకోలేకపోయింది.ఆ మంటల ధాటికి సిలిండర్‌ పేలడంతో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది.

ఇప్పుడు ఆ కుక్క కారణంగా ప్రాణాలు దక్కించుకున్న అందరూ చనిపోయిన దానికీ థాంక్స్ చెప్పుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube