మారుమూల గిరిజన పల్లెల నుంచి ఆస్పత్రులకు వెళ్లాలంటే మన్యం వాసులకు డోలి కష్టాలు తప్పడం లేదు

మన్యం వాసులకు డోలి కష్టాలు తప్పడం లేదు.అత్యవసర పరిస్థితుల్లో మారుమూల గిరిజన పల్లెల నుంచి ఆస్పత్రులకు వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నారు అడవి బిడ్డలు.

 People Problem To Travel From Remote Tribal Villages To Hospitals, Hospitals,-TeluguStop.com

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలోని సున్నంపాడు గ్రామ పరధి నూరుపూడి కి చెందిన మహిళకు నెలల నిండటంతో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.రవాణా వ్యవస్థ లేని నూరుపూడి గ్రామం నుంచి ఆస్పత్రికి వెళ్లాలంటే 8 కిలోమీటర్లు ప్రయాణించాలి.

గ్రామానికి చెందిన చెదల శ్రీలేఖ అనే 26 ఏళ్ల నిండు గర్భిణీ పరిస్థితి తెలుసుకున్న ఎంపిటిసి మడకం అనిల్ కుమార్ స్వయంగా డోలీ ఏర్పాటు చేసారు.

నూరుపూడి నుంచి శ్రీలేఖ బంధువులతో కలసి ఆయన డోలీలో ఆమెను 8 కిలోమీటర్లు మోసుకువెళ్లారు.

నూరుపూడి గ్రామానికి రహదారి లేకపోవడంతో 108, 104 వాహనాలకు అక్కడికి వెళ్లే అవకాశం లేదు.దీంతో అత్యవసర పరిస్థితుల్లో సైతం డోలీలే గిరిపుత్రులకు ఆసరాగా నిలుస్తున్నాయి.8 కిలోమీటర్లు మేర బంధువులతో పాటు డోలీలో గర్భిణీని తరలించడంలో చొరవ చూపిన ఎంపిటిసి మడకం అనిల్ కుమార్ ను గ్రామస్తులు అభినందించారు.సకాలం స్పందించిన ఆయన తీరును కొనియాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube