ప్రజాసేవ కోసం మా కుటుంబం ముందుంటుంది - ప్యాక్స్ చైర్మన్, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రజాసేవ కోసం తమ కుటుంబం ముందుంటుందని ప్యాక్స్ చైర్మన్, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం శాత్రాజుపల్లి వార్డులో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఏనుగు తిరుపతిరెడ్డిని ఘనంగా సన్మానించారు.

 Our Family Is At The Forefront For Public Service Pax Chairman Kdcc Bank Directo-TeluguStop.com

కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ కావడం సంతోషకరమని రెడ్డి సంఘం సభ్యులు కొనియాడారు.

ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాసేవలో తమ కుటుంబం ముందుంటుందని, ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

గత కొద్ది సంవత్సరాలుగా తమ కుటుంబానికి రైతులతో, ప్రజలతో విడదీయని సంబంధాలు ఉన్నాయన్నారు.సన్మానించిన రెడ్డి సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం సుభాష్ యూత్ సభ్యులు ఏనుగు తిరుపతి రెడ్డి ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube