బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగానే రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేసింది..

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నీ బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా అనర్హత ప్రకటించిన నేపథ్యంలో ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎస్ కె గౌస్, బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి ఆధ్వర్యంలో బోయినిపల్లి మండల కేంద్రం లో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్బంగా షేక్ గౌస్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఎంపీ అనర్హత వేటు పై బిజెపి అవలంబిస్తున్న నిరంకుశ పాలన తీరును మండల ప్రజలకు వివరించారు.

 Rajanna Siricilla Congress Vice President Sk Ghouse Comments On Rahul Gandhi Sus-TeluguStop.com

దేశంలో ఆర్థిక నేరస్తులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకు తింటున్నారు.

వారిపై చర్యలు తీసుకోకుండా ఇదేంటి అని ప్రశ్నించిన రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని, ప్రశ్నించే తత్వాన్ని అణచివేయాలనే ధోరణి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందనీ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, తడగొండ ఎంపీటీసీ సభ్యులు ఉయ్యాలా శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు బోయిని ఎల్లేష్, ఎండీ బాబు, పెండ్యాల శ్రీనివాస్ రెడ్డి, దూస జనార్దన్, మండల శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకులు నిమ్మ వినోద్ రెడ్డి, జాగిరి వెంకటేష్, నక్క శ్రీకాంత్, దిలీప్ రెడ్డి, మహేష్, వంశీ, తోట మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube