ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అయ్యాడు.
త్రివిక్రమ్ కాంబోలో గతంలోనే ఎన్టీఆర్ ఒక సినిమాను చేశాడు.అరవింద సమేత చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేక పోయింది.
ఆ సినిమాలో ఎన్టీఆర్ ఒక ఫ్యాక్షనిస్ట్గా కనిపించిన విషయం తెల్సిందే.
ఈసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాస్త విభిన్నంగా ఎన్టీఆర్ను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
అత్తారింటికి దారేది మరియు అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కళ్యాణ్ను పెద్ద బిజినెస్ మ్యాన్గా త్రివిక్రమ్ చూపించాడు.ఇప్పుడు అదే విధంగా ఎన్టీఆర్ను కూడా తదుపరి చిత్రంలో చూపించేందుకు స్క్రిప్ట్ రెడీ చేశాడని తెలుస్తోంది.
ఎన్టీఆర్కు ఇది పాన్ ఇండియా మూవీ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
రికార్డు స్థాయిలో ఈ చిత్రంను రాధాకృష్ణ మరియు కళ్యాణ్ రామ్లు కలిసి నిర్మించబోతున్నారు.ఎన్టీఆర్కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్తో పాటు పూజా హెగ్డే నటించబోతున్నారు. అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన త్రివిక్రమ్ తన తదుపరి చిత్రంను కూడా మళ్లీ బ్లాక్ బస్టర్ సక్సెస్గా నిలపాలని ఆశ పడుతున్నాడు.
మరి అది సాధ్యం అయ్యేనా చూడాలి.