అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్స్టోరీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఫిదా పోరి సాయి పల్లవి నటిస్తున్న ఈ సినిమాతో మరోసారి తన మార్క్ను క్రియేట్ చేయాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా తరువాత చైతూ తాను నటించబోయే సినిమాలను లైన్లో పెట్టే పనిలో పడ్డాడు.
ఈ క్రమంలో సక్సెస్ చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు చైతూ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఇంద్రగంటి చెప్పిన కథ చైతూకు బాగా నచ్చడంతో ఆయనతో సినిమాకు వెంటనే ఒప్పుకున్నాడట.ఇప్పటికే ఇంద్రగంటి డైరెక్షన్లో వస్తున్న వి చిత్రానికి సంబంధించిన రషెస్ను చూసిన చైతూ, ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు.
మొత్తానికి ‘వి’చిత్ర దర్శకుడికి చైతూ బాగానే కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది.కాగా సమంత నటించబోయే సినిమాలో కూడా చైతూ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.