కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్ లోని కోఠి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
హత్య కేసు విచారణలో భాగంగా ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు డాక్యుమెంట్లను అడిగారని తెలుస్తోంది.ఈ క్రమంలో ఇవాళ సీబీఐ కార్యాలయానికి వచ్చిన అవినాశ్ రెడ్డి పత్రాలను అధికారులకు ఇచ్చి వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో దాదాపు 20 నిమిషాల పాటు ఆయన కార్యాలయంలో ఉన్నారు.