తెలంగాణలో ప్రధాని మోదీ( Prime Minister Modi ) పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా వేములవాడ రాజన్నను( Vemulawada Rajanna ) దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కోడె మొక్కులు సమర్పించారు.పూజల అనంతరం వేములవాడలో బీజేపీ నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ లో బీజేపీ ఎంపీ విజయం ఖాయమని పేర్కొన్నారు.కాంగ్రెస్ అతికష్టం మీద అభ్యర్థిని నిలబెట్టిందన్నారు.
కాంగ్రెస్ అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిందన్న ప్రధాని మోదీ పదేళ్ల బాటు బీజేపీ పని తీరు ఎలా ఉందో ప్రజలందరూ గమనించారని పేర్కొన్నారు.బీజేపీ పాలనలో ప్రపంచంలో భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు.
పదేళ్ల కాలంలో ఎన్డీయే సర్కార్ ( NDA governament )అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు.ఈ క్రమంలోనే బీజేపీ విజయం వైపు పరుగులు తీస్తుందని తెలిపారు.