కాలం మారినా, తరాలు మారుతున్నా ఇంకా ప్రజలు మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడటం మానలేదు.ఈ కథ వింటే 20sలో కూడా మాయని మూఢనమ్మకాల కథలేంటి అని కాస్త విస్మయానికి గురి చేయక మానదు.
కృష్ణాజిల్లాకి చెందిన నూజివీడులో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది.జాతకంలో దోషాలు ఉన్నాయని.
అందువలన అతగాడికి 2 సార్లు వివాహం జరుగుతుందని జ్యోతిష్యుడు చెప్పటంతో ఆ వ్యక్తి ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు తూచా పాటిస్తూ మేకకు తాళి కట్టాడు. పట్టణంలోని అన్నవరంరోడ్డు నవగ్రహ ఆలయంలో ఉగాది పండుగ రోజు పొద్దున్న చోటుచేసుకున్న ఈ ఘటన పలువురిని ఆశ్చర్యపరిచింది.
అసలు విషయంలోకి వెళితే, కృష్ణాజిల్లాకి తాలూకా నూజివీడుకి చెందిన ఆ వ్యక్తికి ఎప్పటినుండో పెళ్లి కావడంలేదట.ఈ క్రమంలో అతగాడి తల్లిదండ్రులు అతని జాతకాన్ని ఓ జ్యోతిష్యుడికి చూపించారట.
దానికి అతగాడు పై విధంగా చెబుతూ, ముందు ఓ మేకతో వివాహం నెరిపితే పరిస్థితులు చక్కబడి అతగాడికి ఓ అందమైన వ్యక్తితో పెళ్లి ఖాయం అవుతుందని చెప్పాడట.దాంతో ఆ యువకుని తల్లిదండ్రులు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉగాది రోజున ఈ తంతు ముగించారట.
కాగా ఈ తంతుని దగ్గరినుండి చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు.
ఆధునికి కాలంలో కూడా ఇలాంటి మూఢ నమ్మకాలా అంటూ అవాక్కవడం వారి వంతయిందంట.ఇకపోతే ఈ ఘటనలో వారి వూరి ప్రజలు గాని, బంధువర్గం గాని, ఆఖరికి వారి తోబుట్టువులు కూడా పాలు పంచుకోకపోవడం కొసమెరుపు.ఇక ఈ తంతులో ఆ యువకుడి తల్లితండ్రులు అండ్ పూజారి మాత్రమే పాల్గోవడం విశేషం.
ఈ తంతునంతా గమనించిన ఓ చదువరి ఈ తతంగాన్ని ఓ ప్రముఖ మీదవారికి తెలియజేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది.దాంతో ఆ కుటుంబం దోష నివారణ కొరకే ఈ రకంగా చేయవలసి వచ్చిందని చెప్పారట.
దోష నివారణైతే అయిపోయింది… గాని అందమైన వధువు ఒక్కటే మిగిలివుంది.