టీడీపీ నేత నారా లోకేశ్ సీఐడీ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా పడింది.ఈ మేరకు సీఐడీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా లోకేశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.సీఐడీ ఇచ్చిన 41 ఏ నోటీసులోని నిబంధనలను లోకేశ్ హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణలో భాగంగా సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.అయితే సీఐడీ నోటీసుల్లో పేర్కొన్న విధంగా హెరిటేజ్ పుడ్స్ నుంచి తాను ఎప్పుడో బయటకు వచ్చానన్న ఆయన తానెలా సీఐడీ అడిగిన డాక్యుమెంట్స్, అకౌంట్ బుక్స్ తెస్తానంటూ పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం 10వ తేదీన విచారిస్తామని తెలిపింది.