నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.ఈ మేరకు కూసుకుంట్లతో స్పీకరం పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయించారు.
ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు హాజరైయ్యారు.ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై భారీ మెజార్టీతో కూసుకుంట్ల గెలుపొందిన విషయం తెలిసిందే.