నేటితరం బాగా అలసత్వంతో బతుకుతోంది.అన్ని అవయవాలు బాగానే వున్నా, ఇంకా ఏదో లేదన్న అసంతృప్తి వారిని వెంటాడుతోంది.
అయితే ఈ తరుణంలో కూడా పట్టుదల ఉంటే వైకల్యాన్ని సైతం జయించొచ్చని ఓ విద్యార్థి నిరూపించి అన్ని అవయవాలు సరిగ్గా వున్నవారికి స్ఫూర్తిగా నిలిచాడు.రేసులో పాల్గొన లేని పరిస్థితిలో కూడా ట్రాక్పై పరుగులు పెట్టి మరీ అందరినీ విస్మయానికి గురి చేసాడు.
విద్యార్థి ధైర్యాన్ని చూసి మురిసిపోయిన టీచర్లు… అతన్ని ప్రోత్సహించి గెలిపించారు.
ఈ ఘటన కేరళలోని మలప్పురంలో జరుగగా తాజాగా వెలుగు చూసింది.
పన్తళ్లూర్లోని ఓ హైస్కూల్కు చెందిన అష్రఫ్ అనే పదో తరగతి విద్యార్థికి క్రీడల పట్ల మిక్కిలి ఆసక్తి.అయితే తన ‘మానసిక వైకల్యం’ దానికి బాగా అడ్డుపడేది.
ఈ కారణంగా పాఠశాలలో జరుగుతున్న క్రీడా పోటీల్లో అతగాడు పాల్గొనలేకపోయాడు.దీంతో నిరాశ చెందిన ఆ విద్యార్థిని ప్రోత్సహించేందుకు టీచర్లు అతనికి పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.
అలా వచ్చిన అవకాశాన్ని అతను సానుకూలంగా మలుచుకున్నాడు.దాంతో అతను పెట్టిన పరుగులు నేటికీ ఆగలేదు.తాజాగా ఓ పరుగుల పోటీలో ట్రాక్ మొత్తం సంతోషంగా పరుగులు తీసిన అష్రఫ్ ఆఖరికి ఫినిష్ లైన్కు చేరుకొని విజయం సాధించాడు.అతని కృషికి మెచ్చిన స్కూల్ యాజమాన్యం అతనికి మెడల్ ఇచ్చి సత్కరించింది.
కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్ కుట్టి మంగళవారం దీనికి సంబంధిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.ఈ విషయం వెలుగులోకి వచ్చింది.కాగా ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.