జనవరి మాసం నుండి ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఏవిధంగా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.కరోనా వైరస్ నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా ఎందరో సైంటిస్టులు రేయింబవళ్లు కష్టపడి కరోనా వ్యాక్సిన్ సంబంధించి టీకాను తయారు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే కొన్ని దేశాలలో మాత్రం ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ వచ్చిందని, ఇప్పటికే ఇందుకు సంబంధించి ట్రైల్స్ చివరి దశకు కూడా చేరుకున్నాయి.వ్యాక్సిన్లను ప్రజలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో కొందరు సైంటిస్టులు కరోనా వ్యాధి సోకిన వారికి గుడ్ న్యూస్ తెలిపారు.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులార్ వైరాలజీతో పాటు మరికొన్ని టాప్ యూనివర్సిటీలకు చెందిన సైంటిస్టులు ఈ మధ్యకాలంలో నీ కరోనా వైరస్ ను చంపే పదార్ధాలపై ప్రయోగాలు చేయగా ఇదే క్రమంలో వారు కొన్ని రకాల జ్యూసులను తాగితే కరోనా వైరస్ 97 శాతం వరకు అంతమవుతుందని తేల్చారు.
ఇందులో భాగంగానే చోక్ బెర్రీ జ్యూస్, దానిమ్మ పండు జ్యూస్, ఎల్డర్ బెర్రీ జ్యూస్ లతో కరోనా వైరస్ నుంచి ఉపశమనం పొందవచ్చని వారు గుర్తించారు.వీటితో పాటు గ్రీన్ టీ అలాగే దానిమ్మ పండు జ్యూస్ తో కూడా కరోనా వైరస్ 80 శాతం వరకు నశించింది అని వారు తెలియజేశారు.
ఇక ఈ జ్యూస్ లలో వైరస్ ఉంచితే ఆ వైరస్ ఎక్కువసేపు బతకలేనని చాలా త్వరగా నశించిందని సైంటిస్టులు తెలియజేశారు.

ఇక స్వైన్ ఫ్లూ వైరస్ తో ఈ జ్యూసులు, పానీయాలలో ఆ శాస్త్రవేత్తలు పరీక్షలు చేయగా అన్నిటిలో కూడా కేవలం స్వైన్ ఫ్లూ వైరస్ ఐదు నిమిషాల కంటే ఎక్కువగా జీవించలేదని వారు తెలియజేశారు.స్వైన్ ఫ్లూ వైరస్ ఈ పానీయంలో ఏకంగా 99 శాతం వరకు పూర్తిగా నశించింది అని శాస్త్రవేత్తలు గుర్తించారు.కాబట్టి స్వైన్ ఫ్లూ, కరోనా వైరస్ లాంటి వ్యాధులకు ఈ పానీయాలు ఔషధాలుగా పనిచేస్తాయి అని కొందరు సైంటిస్టులు నమ్ముతున్నారు.
చూడాలి మరి ఏ వ్యాక్సిన్ అతివేగంగా వచ్చి ప్రపంచంలో ఉన్న కరోనా మహమ్మారి పూర్తిగా నశింపచేస్తుందో.