అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఏడాది అవుతున్నా సిఎం ఇచ్చిన హామీలు నెరవేరలేదని జనసేన పిఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్వాసితుల స్థితిగతులపై రెండు రోజులు అధ్యయనం చేసి పవన్ కళ్యాణ్ కు నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.
కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనకు తిరుపతి ఎయిర్ట్ కు వచ్చిన నాదెండ్ల మనోహర్ కు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ నేతృత్వంలో స్వాగతం పలికారు.ఎయిర్ పోర్ట్ లో నాదేండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు.
మూడు నెలల్లో అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఇల్లు కట్టిస్తామన్నారు సీఎం హామీ నెరవేరలేదని ఆయన విమర్శించారు.జనసేన మొదటి రోజు నుంచి నిర్వాసితుల పక్షాన పోరాడుతుందని ఆయన తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ ల మధ్య జరిగిన భేటీ వివరాలను జనసేన వెల్లడించదని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.మోడీ పవన్ కళ్యాణ్ లా భేటీ పై వస్తున్న రోమర్స్ లో ఎటువంటి నిజం లేదని ఆయన చెప్పారు.
వైసిపి ముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన పనిచేస్తుందని ఆయన చెప్పారు.మంత్రి జోగి రమేష్ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ ఆవరణలోని జన సైనికులపై దాడికి పాల్పడడం దారుణమని నాదెండ్ల మనోహర్ అన్నారు.
ప్రభుత్వ దాడులకు జనసైనికులు భయపడరని ఆయన హెచ్చరించారు.ఏడాది కిందట ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కడప జిల్లా లో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది.
నాలుగు గ్రామాల ప్రజలు పూర్తిస్థాయిలో నష్టపోయారు.తన సొంత జిల్లాలో జరిగిన ఘోరం పై సిఎం పది రోజుల తరువాత స్పందించారు.
మూడునెలల్లో ఇంటి తాళాలు ఇస్తామన్న సిఎం హామీ నెరవేరలేదు.ఎకరాకు 12,500 ఇస్తామని చిల్లిగవ్వ ఇవ్వలేదు.
యువతకు ఉద్యోగం ఇవ్వలేదు.సిఎం హామీలు అమలు కానీ తీరును ప్రజలపక్షాన సేకరిస్తాం.
అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్వాసితుల పరిస్థితిపై పవన కల్యాణ్ కు నివేదిక ఇస్తాం.మోడీ తో పవన్ భేటీ నిర్ణయాలను జనసేన వెల్లడించదు.మోడీ…పవన కల్యాణ్ భేటీపై వస్తున్న రూమర్స్ అర్థరహితం.ఎన్నికల సందర్భంలో జరగాల్సిన చర్చను ఇప్పుడు తేవడం సరికాదు.
వైసిపి ముక్త ఏపి కోసం జనసేన పనిచేస్తుంది.పెడనలో పోలీస్ స్టేషన్ ఆవరణలో జనసేన కార్యకర్తలపై దాడి అమానుషం.
ప్రభుత్వ దాడులకు జనసైనికులు భయపడరు.