యూఎస్ కాంగ్రెస్ ఎన్నికల బరిలో భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ సోదరి సుశీలా జయపాల్( Susheela Jayapa ) నిలిచారు.ఒరెగాన్ నుంచి ఆమె అధికారికంగా కాంగ్రెస్ రేసులో నిలిచారు.
ఒరెగాన్లైవ్ న్యూస్ పోర్టల్ ప్రకారం.మాజీ కౌంటీ కమీషనర్ బుధవారం సుశీల అభ్యర్ధిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో ‘‘ ఈ రోజు.నేను కాంగ్రెస్ అభ్యర్ధిత్వాన్ని ప్రకటించినందుకు గర్వపడుతున్నాను’’ అని సుశీలా జయపాల్ పేర్కొన్నారు.
గతంలో న్యాయవాదిగా పనిచేసిన ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను ఒరెగాన్ ముల్ట్నోమా కౌంటీ బోర్డ్ ఆఫ్ కమీషనర్స్లోని తన పదవికి రాజీనామా చేశారు.

నిరాశ్రయుల సంక్షోభం, ప్రజా భద్రత, ఫ్రంట్ లైన్ కార్మికులకు వేతనాల వంటి కీలక సమస్యలపై తాను పనిచేస్తానని సుశీల హామీ ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీ( Republican Party )లోని తీవ్రవాద భావజాలం, ప్రజాస్వామ్యం, వ్యక్తిగత హక్కుల కోసం నిలబడటం వంటి వాటిని ఎదుర్కోవడానికి తన నిబద్ధతను ఆమె పునరుద్ఘాటించారు.కాంగ్రెస్లో విస్తృత జాతీయ సమస్యలను పరిష్కరించాలనే తన ఉద్దేశాన్ని సుశీల వ్యక్తం చేశారు.
మరోవైపు.వాషింగ్టన్ రాష్ట్రంలోని 7వ కాంగ్రెస్ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సుశీల సోదరి ప్రమీలా జయపాల్ ఆమె కాంగ్రెషనల్ బిడ్ను ఆమోదించారు.
తన సోదరి సుశీల .కాంగ్రెస్ ఎన్నికల కోసం ప్రచారాన్ని ప్రారంభించిందని ప్రమీలా ఎక్స్లో ట్వీట్ చేశారు.అయితే కార్పోరేట్ పీఏసీల నుంచి విరాళాలు స్వీకరించడం మానేసిన సుశీలా జయపాల్.కాంగ్రెస్ రేసు కోసం అట్టడుగు స్థాయి మద్ధతుపై ఆధారపడుతున్నారు.దాదాపు రెండు దశాబ్ధాలుగా లాభాపేక్షలేని పలు బోర్డుల్లో ఆమె సేవలందించారు.ఈ క్రమంలోనే 2018లో ముల్ట్ నోమా కౌంటీ కమీషనర్లో ఉత్తర, ఈశాన్య పోర్ట్ల్యాండ్కు ప్రాతినిథ్యం వహించడానికి ఎన్నికయ్యారు.

భారత్, సింగపూర్, ఇండోనేషియాలలో పెరిగిన సుశీలా జయపాల్ అమెరికాలోని పెన్సిల్వేనియాలో వున్న స్వర్త్మోర్ కళాశాలలో ఆర్ధిక శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించారు.చికాగో యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందిన తర్వాత.సుశీలా జయపాల్ న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.తొలుత ప్రైవేట్ ప్రాక్టీస్లో అటార్నీగా ప్రాక్టీస్ చేసిన ఆమె.అనంతరం అడిడాస్ అమెరికాకు రెగ్యులర్ న్యాయవాదిగా సేవలందించారు.