భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య చాలా ఏళ్లుగా సంబంధాలు లేవు.అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇజ్రాయెల్ తో సంబంధాలు కుదుర్చుకోవాడనికి అసలు ప్రయత్నించలేదు.
దీనికి పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ కు ఉన్న గొడవలే కారణం.ఓటు బ్యాంకు రాజకీయం కోసం కాంగ్రెస్ పాలస్తీనా ను భుజం పై వేసుకొని ఇజ్రాయెల్ ను దూరం పెట్టింది…
ఇన్నేళ్ల తరువాత మోడీ ప్రభుత్వం లోని భారతదేశం ఇజ్రాయెల్ తో సంబంధాలు బలోపేతం చేసుకుంది.
ఈ సంబంధాల వల్లే తేజస్ రాకెట్ లు గాలిలోకి ఎగిరాయి.తాజాగా నరేంద్ర మోడీ తన ట్విట్టర్ అకౌంట్ లో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహుతో కరోనా మహమ్మారి ని ఎదుర్కోవడానికి గల పరిష్కారాల గురించి చర్చించామని, దీనికోసం తాము సిద్ధంగా ఉన్నామని, ఇరు దేశాలు ఈ పోరాటం లో కలిసి పనిచేస్తాయని ఆయన తెలిపారు.
వీటితో పాటు నీరు, వ్యవసాయ, వినూత్న పరిశోధనల గురించి చర్చించాము అని తెలిపారు.మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత చాలా దేశాలు భారతదేశానికి సహకారం అందించడానికి సిధంగా ఉన్నాయని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.