బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో( Bigg Boss Show ) విషయంలో ప్రేక్షకుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి.బిగ్ బాస్ ఎవరిని గెలిపించాలని అనుకుంటే వారే ఈ షో విజేతగా నిలుస్తారని చాలామంది భావిస్తారు.
అయితే పల్లవి ప్రశాంత్ విషయంలో భారీ కుట్ర జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రశాంత్ గెలవకుండా ఏకంగా సరికొత్త మోసం జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
బిగ్ బాస్ సీజన్7 టాప్2 కంటెస్టెంట్లలో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఉన్నారు.ఈ ఇద్దరిలో ఎవరు నంబర్ వన్ అంటే కచ్చితంగా చెప్పలేం కానీ పల్లవి ప్రశాంత్( pallavi prashanth ) ప్రస్తుతం శివాజీ కంటే టాప్ లో ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బిగ్ బాస్ షో నిర్వాహకులు ఇచ్చిన పల్లవి ప్రశాంత్ మిస్డ్ కాల్ నంబర్ సరిగ్గా పని చేయడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.పల్లవి ప్రశాంత్ విషయంలో మాత్రమే ఈ విధంగా జరుగుతోంది.
మిగతా కంటెస్టెంట్ల మిస్డ్ కాల్ నంబర్లు మాత్రం బాగానే పని చేస్తున్నాయి.పల్లవి ప్రశాంత్ మిస్డ్ కాల్ నంబర్ విషయంలో ఈ విధంగా జరగడం వల్ల ప్రశాంత్ కు ఓట్లు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది.ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్న పల్లవి ప్రశాంత్ కు అన్యాయం జరుగుతోందని ఆయన అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.పల్లవి ప్రశాంత్ రెమ్యునరేషన్( Remuneration ) కూడా తక్కువేననే సంగతి తెలిసిందే.
వారానికి లక్ష రూపాయల చొప్పున పల్లవి ప్రశాంత్ కు పారితోషికం దక్కుతోందని సమాచారం అందుతోంది.పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విజేతగా నిలుస్తారో లేదో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
బిగ్ బాస్ షో సీజన్7 మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.పల్లవి ప్రశాంత్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.