టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎస్ఎల్పీతో పాటు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎస్ఎల్పీపై విచారణలో భాగంగా చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు.అటు సీఐడీ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే అన్ని కేసుల్లోనూ 17ఏ ను ఛాలెంజ్ చేస్తున్నామని లూథ్రా పేర్కొన్నారు.
దీనిపై సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ వర్తించదని చెప్పారు.
సెక్షన్ 17ఏ జూలై 2018లో వచ్చిందన్న ఆయన స్కిల్ డెవలప్ మెంట్ నేరం 2015, 2016 నుంచే ఉన్నాయని తెలిపారు.సెక్షన్ 17ఏ ప్రయోజనం ఏదీ ఈ కేసుకు ఇవ్వబడదని పేర్కొన్నారు.
ఎఫ్ఐఆర్ లోని ఆరోపణలను విధి నిర్వహణలో భాగంగా తీసుకున్నవని లేదా సిఫార్సులని పరిగణించలేమని వెల్లడించారు.