రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యువజన ఆవిర్భావ వేడుకలను మండల అధ్యక్షుడు బానోతు రాజు నాయక్( Raju Naik ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా మండల ప్రభుత్వ దవాఖానాలో పండ్లు, బ్రేడ్ లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చిన్ని బాబు, బిసి సెల్ అధ్యక్షుడు అనవెని రవి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిపేట రాజు, రాగట్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు సిరిపురం నరేందర్,చంద్రం, రఫిక్,యూత్ నాయకులు ఉత్తర లక్ష్మణ్, శ్రీకాంత్,బోల్లు గంగన్న, సతీష్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.