జమ్మూకశ్మీర్ లో పడవ ప్రమాదం.. నలుగురు మృతి

జమ్మూకశ్మీర్ ( Jammu and Kashmir )లో పడవ ప్రమాదం చోటు చేసుకుంది.శ్రీ నగర్ సమీపంలో జీలం నదిలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది.

 Four People Died In Boat Accident In Jammu And Kashmir , Jammu And Kashmir , Pe-TeluguStop.com

ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడగా.పలువురు గల్లంతు అయ్యారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.ఇందులో భాగంగా గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

అయితే ఘటన చోటు చేసుకున్న సమయంలో పడవలో 12 మంది విద్యార్థులు ఉన్నారని తెలుస్తోంది.విద్యార్థులంతా గాంద్ బల్ నుంచి బట్వారాకు వెళ్తున్నారు.

గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీలం నదికి వరద పోటెత్తిందని, ఈ క్రమంలోనే పడవ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube