టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ( Vangaveeti Radhakrishna )నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది.ఆదివారం నరసాపురంలో ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్దిమంది ఆత్మీయులు సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జక్కం అమ్మనీ, బాబ్జి( Ammani, Babji ) దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లితో రాధా నిశ్చితార్థం జరిగింది.వాస్తవానికి ఈ నిశ్చితార్థం అక్టోబర్ 19న జరిగించాల్సి ఉండగా కొన్ని అన్నివారే కారణాలతో వాయిదా పడటంతో సెప్టెంబర్ 3న అనగా నేడు నిశ్చితార్థం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ( Bandaru Madhava Naidu )సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కావడం జరిగింది అంట.
ఇక అక్టోబర్ 22వ తారీకు సాయంత్రం ఏడు గంటలకు వీరి వివాహం జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారట.వంగవీటి రాధా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు.2004వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.ఆ తర్వాత 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు.ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యి 2014వ సంవత్సరంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి చెందారు.సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీని( YCP ) వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినా రాధా అప్పటి ఎన్నికలలో పోటీ చేయలేదు.2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కాస్త రాజకీయంగా సైలెంట్ అయిన రాధా ఇటీవల లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు.