తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు( Telangana assembly meetings ) కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా మొదటిసారి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.
తమది ప్రజల ప్రభుత్వమన్న భట్టి నిస్సహాయులకు సాయం చేయడమే తమ విధానమని తెలిపారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఆరు గ్యారెంటీలను ప్రకటించామన్నారు.
గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రంలో కష్టాలు వచ్చాయని ఆరోపించారు.ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు.అయితే బీఆర్ఎస్( BRS ) పాలనలో మోసపోయామని గ్రహించిన ప్రజలు తమ హామీలనే నమ్మారని పేర్కొన్నారు.
మెరుగైన పాలన అందించడమే తమ లక్ష్యమని భట్టి విక్రమార్క( Mallu Bhatti Vikramarka ) స్పష్టం చేశారు.గతంలో షెడ్యూల్ కులాలు, తెగలకు బడ్జెట్ లో పెట్టిన నిధులు ఖర్చు చేయలేదన్నారు.మహిళలకు రూ.7,848 కోట్లు పెట్టి… రూ.2,665 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.