తెలంగాణ సీఎం కేసీఆర్ తో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశం అయ్యారు.ఈ మేరకు అసెంబ్లీ హాల్ లో ఇరువురు భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో మహబూబ్ సాగర్ అభివృద్ధి, దళిత బంధు పథకంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై జగ్గారెడ్డి సీఎంతో మాట్లాడారు.అనంతరం మెట్రో ట్రైన్ విషయంలో కేసీఆర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ క్రమంలో జగ్గారెడ్డి వినతుల గురించి సీఎం కేసీఆర్ అధికారులతో మాట్లాడారని తెలుస్తోంది.